Tuesday, December 31, 2013

డైరీలో ఒక రోజు

(పాత సంవత్సర౦ నాకు ఎన్నో జ్ఞాపకాలని మిగిలించింది. అందులో ముఖ్యమైంది. గొప్ప అవకాశం గా బావించింది, "చంద్రబాబు" తో కలవడం. అప్పుడు నేను రాసి పెట్టుకొనది.)

Neelayapalem Vijay Kumar నుండి అనుకోకుండా ఒక ఆఫర్. 
"నేను వెళ్తున్నా, నేను అక్కడే, వాళ్ళతోనే ఉంటాను. నీకు వీలుంటే చెప్పు, కొన్ని రోజులు మాతో ఉండొచ్చు." 
" సరే" అన్నాను కాని, అనుకోకుండా అప్పుడే ఆఫీస్ టూర్స్, మీటింగ్స్ పడిపోయాయి. 
మన జిల్లాకు వచ్చినప్పుడే కలుద్దాం, అనుకొన్నా, అదే టై౦ లో విజయ్ హైదరాబాద్ వచ్చేసాడు. 
మనది ఒక జిల్లా కాదు కదా, కరీంనగర్ అయిన, వరంగల్ అయిన ఓ.కే. అని ఎదురుచూస్తున్నా సమయంలో మల్లి విజయ్ నుండి కాల్...
"జగిత్యాల్" లో జాయిన్ అవుతున్నా వస్తావా..
"అంతకన్నానా.." అని అన్ని విదాలుగా రెడి అయిపోయా..
అనుకొన్న రోజుకి విజయ్ కి మాలి ఎదో మీటింగ్, ఆగిపోయం.
మరుసటి రోజు ..మల్లి కాల్ రేపోద్దునే బయలుదేరుదాం అని.
శనివారం సెలువు రోజు కలిసిరావడం, విజయ్ తో పాటు జగిత్యాల్ బయలుదేరా౦.
దారి పొడువునా నా ప్రశ్నలే,
"అన్నయ్య, తెలంగాణా లో ఎలా ఉంది."
"మెదక్ లో ఎక్కడెక్కడ ప్రయాణం ఎలా జరిగింది."
"అసలు ఏమి చెపుతున్నారు"
"ఆదిలాబాద్ లో, నిజామాబాద్ లో ఎలా ఉంది"
సమాధానాలు, విశ్లేషణలతో బస్సు జగిత్యాల్ శివారులో చేరింది..
ఆశ్చర్య పోవడం నా వంతు అయ్యింది. జగిత్యాల్ లో చాల కష్టం అన్నారు.,అపెస్తామన్నారు.
కాని ..అక్కడ బస్టాండ్ చుట్టూ, హైదరాబాద్ వెళ్ళే రోడ్డు మొత్తం జనాలతో నిండి పోయింది.
బాబు మాట కోసం ఎదురుచూస్తున్నా జనాలు. సామాన్య జనాలే మైకు లో మాట్లాడుతూ,ఆసాధారణ చైతన్యం చూపిస్తూ అనేక ప్రశ్నలు, కోరికలు, కోపాలు, తమ శాపాలు చెపుతు .. ఒక నిజమైన ప్రజా సభ జరుగుతోంది.
ఆ మరుసటి రోజు విజయ్ గ్రూప్ లో సభ్యుడిగా బాబు అడుగు వేనేకే అడుగు వేస్తూ నడిచే అవకాశం, పేపర్లో చదివిన దానికన్నా చురుగ్గా, జనాల్లో కలిసిపోతూ, తనను చూసి stun అయి నిలపడి పోయిన వాళ్ళని కూడా పలకరిస్తూ, పొలాల్లోకి, దుకనాల్లోకి, వెల్డింగ్ షాప్ లోకి, బిది ఖర్కనా ల్లోకి చొరవగా చేరిపోతు, వాళ్లతో మాట్లాడుతూ ...
"ఏంటి అన్నయ్యా ..సెక్యురిట ప్రాబ్లెం లేదా, ఇంత కలిసి పోవడం ఏంటి "
"తన కున్న ఇమేజ్ అతన్ని గొప్పవాడిగా అందరికి దూరం చేస్తుంది, అందుకనే పోలిస్ డ్రెస్ ఉన్నవాళ్లు తన ముందు లేకుండా చూసుకొని అందరితో కలిసి పోతున్నాడు ..., ఇప్పుడు అది తప్పదు  కూడా "
మద్యలో చిన్న రెస్ట్లు, మల్లి నడక" అర్థరాత్రి పుట కూడా అడువులలో, శివార్లలో నడక ..
"అక్కడే ఆగిపోవచ్చు కదా, ఇంట రాత్రి వేల ఇలా గుట్టల వెంబడి నడవడం ఎందుకు"
" తెల్లారి నడక మొదలు పెట్టగానే గ్రామనికి దగ్గర ఉండాలని"
అమ్మో చాల అంది ప్రనలికే ..
" అవును, అది బాబు క్రమశిక్షణ"


ఆ రోజు బాబు గారితో నాలుగు మాట్లాడే బాగ్యం.
నేను: (నన్ను నేను పరిచయం చేసుకొని): సార్ నేను కరీంనగర్, వరంగల్ లో దాదాపు ఇరవై వేల రైతు లతో ప్రాజెక్ట్ చేస్తున్నాం. నాలుగు సొసైటి లు గా ఏర్పడ్డాము. మీకు వారితో కూర్చొని మాట్లాడితే బాగుంటుంది అనుకొంటున్నాo. మీకు విలు ఉంటుందా.?
బాబు: రైతులతో మీటింగ్ జమ్మికుంట లో ప్లాన్ చేసారు. విజయ్ తో మాట్లాడండి.
నేను: సరే సార్.. జమ్మికుంట లో ధర్నా ఉంటుందంటున్నారు. రైతు ల మీటింగ్ అయితే ఇంకా అనేక విషయాలు మాట్లాడొచ్చు. నీటి గురించి, ఫెర్తిలైసర్, విత్తనాలు అనేక అంశాలు ఉన్నాయి..
బాబు: అలా అయిన బానే ఉంటుంది. విజయ్ గారు.  (ఆయన్ని పిలిచారు) 


విజయ్: సార్
బాబు: రైతుల తో మీటింగ్ ఆలోచన బానే ఉంది. మీరు పెద్దిరెడ్డి గారితో, ఎర్రబల్లి గారితో మాట్లాడండి.
విజయ్: సరే సార్.
నేను: నేను మీ హయం లో "వాటర్ vision" పై పని చేసాను. అందులో అన్ని రంగాలకు కావాల్సిన నీటి అవసరాలు, పంపిణి, అందుకు తగ్గ ప్రణాళిక లు అన్ని జిల్లాలలో మీటింగ్ లు పెట్టి తాయారు చేసాం. తరువాత వచ్చిన ప్రభుత్వాలు, లేదా అధికారులు సగం ఆచరణలో పెట్టిన ఇప్పుడు విద్యుత్తు, వ్యవసాయ, నీటి సమస్యలు ఉండేవి కావు సార్
బాబు: అవునా..అప్పుడు పని చేసారా?? అయినా ఇవన్ని రైతులకు అర్థం కావు. ఏం చేస్తాం.??
అప్పుడే పెద్దిరెడ్డి గారు ఆయనతో ఎదో మాట్లాడాలని రావడం.. నేను వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. (పెద్ది రెడ్డి వచ్చినాక, "
ఈయన వరంగల్ లో రైతు లతో పని చేస్తారట.., రైతలతో మాట్లాడడానికి ఎదో ఒక రోజు చుడండి. అంటూ నన్ను ఆయనకు పరిచయం చేసారూ కుడా),


అలా ఆ పాదయాత్ర మత్తులో ఉండిపోయాను..ఆ రోజు రాత్రి విజయ్ తో మాట్లాడుతూ..
".... మరన్నయ్య కర్చులు".
"ఎవరి ఖర్చులు వారివే"
" అంటే మీ ఖర్చులు ??:
" డిజిల్, కొన్ని సార్లు  భోజనాలు ఖర్చులు మావే"
...మిమల్ని, మీ పార్టి ని, , మీ లిడార్ ని మెచ్చుకోవచ్చు...
"ఇలాంటి లిడర్ ని మిస్ అయిపోయామని మన వాళ్ళు కచ్చితంగా గుర్తిస్తారు..
ఇప్పుడు గుర్తించకపోతే, మన దురద్రుస్తాన్ని చరిత్ర గుర్తిస్తుంది "
---- అయన జన ప్రలోబ నేత కాలేదేమో, కాని జనం కోసం "విజన్" కలిగిన ఏకైక నేత"
---- ఈ రోజు విశాక సముద్ర తీ రానా, జన సముద్ర౦ తో బా బు పద యాత్ర ముగింపు వేడుక రాష్ట్ర ప్రజా ఆలోచనలను మరింత విమర్శనాత్మకంగా ముందుకు సాగాలని ....
చంద్రబాబుకి, పార్టి వారికి అభినదనలు

Wednesday, November 27, 2013

వదలని JK “ముందున్న జీవితం”

 “ఈ రోజు నుండి దేవుణ్ణి నమ్మదల్చుకోలేదు.!”
సాయంత్రం పరివార్ ధాబా కు వెళ్తూ ఎదో ఎవరో అమ్మయిలగురించి సరదాగా మాట్లాడుతూ వెళ్తున్న మా మిత్ర త్రయం తో పూర్తి అసందర్భంగా, అసంకల్పితంగా నేనన్న మాట. 
“ఏంట్రా ఏమన్నావ్??
...
“అయితే మాకేంటి..ఇప్పుడెందుకు సడన్ గా గుర్తొచ్చింది.!”
....
“అవునన్నా! కాలేజ్, హాస్టల్ వదిలేసి వెళితే, ఎలా ఉంటామన్నా?? జాబ్ లో బిజి అయిపోవడం.....” శ్రికరన్న తో శ్యాం ఎదో మాట్లాడుతూ ఉన్నాడు..నేనన్న మాటనే కాదు, నన్నే పట్టించుకోవడం మానేసారు.. నడక సాగుతూనే ఉంది.! 
అవును.., అప్పుడెందుకు అలా అన్నాను.! ఏమి ఆలోచిస్తు ఉండుంటాను ??
అవంచనియంగా ఆ క్షణం లో అన్న కుడా ఇప్పుడు తెలుస్తోంది, ఆ క్షణం గొప్పతనం.!

---------------------

మనలో మన ఆలోచనలలో కలిగే మార్పులకు ఒక “ఇండికేటర్” కావాలంటే దొరకదేమో ! అది మెల్లిగా, అతి మెల్లిగా, చాల నిదానంగా మొదలవుతుందేమో.! కాని అందులో ఎదో ఒక క్షణం అంతటికి కారణభూతమై నడిపిస్తుంది.
అలాంటి క్షణం ఏదైనా చెప్పలంటే నేను ముందు చెప్పిన క్షణా౦. అందుకు ఉసిగొల్పిన కొన్ని కారణాలు..
అవి నిజానికి డ్రమాటిక్ కాకపోవచ్చు..కాని నాకు సంబంధించి నా జీవిత గమనానికి పెద్ద మార్పులు..

------------------
చినప్పడినుంది పుస్తక౦ అంటే వ్యామోహమే.! స్కూల్ పుస్తకాలు కాదు..కథల పుస్తకాలూ.  అరటి పండ్ల ను చుట్టి తీసుకొచ్చిన పేపర్ కూడా చదివెంత పిచ్చి ఉండేది చినప్పుడు. హాస్టల్ వదిలి, హాలిడేస్ లో ఇంటికి వెళ్ళగానే పాత పేపర్ కట్టలు ముందు వేసుకొని, అందులో కథలు (ఈనాడు మూడో పేజిలో వచ్చే బొమ్మల కథ, కార్టూన్లు, సండే వచ్చే ఇది కథ కాదు లాంటివి) చదివే వాడిని..అప్పట్లో సుల్తానాబాద్ లోని (కరీంనగర్ జిల్లా), శాఖ గ్రంథాలయం లో పిల్లల పుస్తకాలు మొత్తం చదివేసాను.
అలా ఏది పడుతూ అది చదువుతున్న సమయం లో, కథ ల పుస్తకాలు దాటి సీరియస్ పుస్తకాలు చదవాలని అనిపించేట్టు చేసింది “ముందున్న జీవితం”.
బి.ఎస్సి.(అగ్రికల్చర్) మూడో సెమిస్టర్ చదువుతూ, రెండో సెమిస్టర్ ఎగ్జామ్స్ రాస్తున్న టైం లో, అప్పటికే ఉన్న గ్రేడ్ పాయింట్ పెంచుకోవాలని
, చదవడానికి తెగ ప్రయత్నిస్తున్న కాలం లో, ఈ పుస్తకం ఒక మిత్రుని ద్వార దొరికింది. పుస్తకం కోఠీ లో తీసుకోని, రాజేంద్ర నగర్ వచ్చి మొదలుపెట్టి చదువుతూ ఉండిపోయాను. ఒక్క రోజు కాదు, ఒక వారం. రేపు పరిక్షలు అన్నరోజు వరకు.    
మొదటి కొన్ని పేజీలు తిప్పగానే అర్థం అయింది, “ఇతన్ని అర్థం చేసుకోవాలంటే మనల్ని మనం (బుర్రలను) పూర్తిగా ఖాలీ చేసుకొని చదవడం మొదలు పెట్టాలని”. ఒక పేరా చదవడం, ఆ తరువాత ఆలోచనలలో మునిగిపోవడం, ఆశ్చర్యపోవడం, మల్లి అలోచ్చించడం, ఒక నిర్ణయానికి రావడం, మల్లి చదవడం..
మిగితా పుస్తకాలలో ఉన్నది, జిడ్డు కృష్ణముర్తి పుస్తకం లో మాత్ర౦  కనపడనిది..,”సూత్రాలు, సూక్తులు, మంచి మంచి సలహాలు”..అవును, అతని పుస్తకాలలో మిగితా గురువులు చెప్పే సూత్రాలు, సూక్తులు ఉండవు. (నాకు అర్థం అయ్యింది, ఆ తరువాత నన్ను అత్యదికంగా ప్రభావం చేసింది, అదే!).  జిడ్డు కృష్ణమూర్తి ప్రతి ప్రశ్న కు సమాధానం నిన్నే వెతుక్కోమంటాడు. నీకు సమాధానం దొరకడం విలు కాకపొతే, మనం ఇద్దరం కలిసి ప్రయత్నిద్దాం అంటాడు. అల వెతికే క్రమం లో పై, పై పొరలు తొలిగిపోతుంటాయి.  ఒక దేశం, మతం, ప్రాంతం, చుట్టూ ఉన్న సమాజం ఎప్పుడో ఏర్పరిచిన మాయ చట్రాలు ఎవైన ఉంటె అవి దాటి ఆలోచించేలా మనకు తోడ్పడుతాడు. సత్యాన్వేషణ లో అసలైన దారి చుపెడతాడు. సమస్య లకు, సంక్లిష్టాలకు, అనుమానాలకు మనం గురువులను, సమాదాన పరిష్కారాలను చుపెవారి కోసం వెదుకుతూ ఉంటాం. కాని వాటిని నీలో సృస్టించు కొన్నది నివే కనుక, నీకు నివే గురువు అయి సమాధానం వేడుక్కోవాలంటాడు. అందుకని సమస్యలతో, నీతో, నీ పక్కవల్లతో, నీ స్నేహితులతో, బంధువులతో, మన ఆశలతో, వారి ఆశలతో ఉన్న బందాలను అర్థం చేసుకొంటే ఈ క్లిష్టత తోలిగిపోతుందంటాడు.   

సత్యాన్ని అన్గికరించకపోవడమే “భయం” అని చదవగానే, నాలో ఉన్న ఎన్నో భయాలు తోలిగిపోవడం మొదలయింది. భయాలకు మనం వేసుకొన్న ఎన్నో ముసుగు లు (అందులో స్వర్గం, నరకం, దేవుడు కుడా ఉన్నాయి) కనపడడం మొదలయింది.   
మనలో ఉన్న జ్ఞానం, అనేక జ్ఞాపకాల సమాహారం. చదువుకొన్నది, చూసింది, మన మతం మనతో చెప్పింది, మన దేశం గురించి మనం విన్నది, మన పెద్ద వారి నుండి మనకు వచ్చింది, ఆచారాలతో పాటు వచ్చింది..ఇలా అనేకం. ఇవే మనకు ముందుండి మనల్ని నడిపిస్తాయి. కాకపొతే మనకు ఎదురయ్యే కొత్త, కొత్త సవాళ్ళకు, పాత సమాధానాలే ఇవ్వి చుపగాలుగుతాయి. ప్రతి సమస్యను మన జ్ఞాపకాలతో, అనుభవాలతో ముడిపెడుతూ, అలవాటైన పద్దతిలోనే పరిష్కరించటానికి చూస్తుంటాం. కాని సమస్య లోనే, ఒక కొత్త సమాదానం ఉందేమో, కొత్త దారిలో వెడితే ఎలా ఉంటుందో, మన ఈ సమస్యలకు పాత అనుభవాల ముసుగులు ఎలా అడ్డం పడుతాయో అలోచిన్చుకోమ౦టాడు.
ఇది ఇప్పుడు నాకు కలిగిన అభిప్రాయం. అదే అభిప్రాయం ఎల్లా కాలం ఉండాలని తను చెప్పలేదు. అసలు తను చెప్పింది మాత్రమె కరెక్ట్ అని అనలేదు. మనల్ని ఆలోచించుకోమన్నాడు.
---------------------

అలా జిడ్డు కృష్ణమూర్తి పుస్తకం ” ముందున్న జీవితం” (లైఫ్ ఆహేడ్ అనే ఇంగ్లిష్ పుస్తక అనువాదం), నా ఆలోచన విధానాలను మార్చింది. అన్ని విషయాలలో  నాదైన సమాధానం వేదుక్కోవడానికి ఉపయోగపడింది. అవి కచ్చితంగా నా జీవన విధానం లో మార్పులు తీసుకువచ్చింది. దేవుడు గురించి ఆలోచించటానికి ఎక్కువ రిసెర్చ్ చేశాను, దొరికిన పుస్తకాలూ చదివాను. నేన్నిన్ని రోజులు “దేవుణ్ణి” నమ్మడానికి గల కారణాలను ఒక సారి పరిశీలించాను. అవి అన్ని పూర్తీ తప్పు కారణాలని అర్థం అయ్యింది. నాకు మరో కారణం దొరికేవరకు అన్వేషిన్చాలనుకొన్నాను. అలా అదే ధ్యాసలో ఆలోచిస్తూ, అప్పుడు ఆరోజు సడన్ గా అలా నిర్ణయించుకొన్నాను. అప్పటినుండి ప్రతి ఒక్కటి కొత్తగా కనిపించడం మొదలయింది. చాల వాటి మిద భయం పోయింది. నా వ్యక్తిత్వ నిర్మాణానికి, అది బయట వారికి వ్యక్తీకరించే పద్దతి మారింది.


ఆ రోజు నుండి ఇప్పటికి ఆ పుస్తకం నన్ను వదిలిపోలేదు. నేనే కాదు, నా ద్వార వెళ్ళిన ఎంతో మందిని అది వదిలి వెళ్ళదు.

Wednesday, November 6, 2013

మరో వందేళ్ళ కోసం పదేళ్ళ ప్రయాణం (నా పెళ్లి రోజుకో కవిత)

"కవితలు రాస్తానని చెప్పుకొంతావ్, ఎప్పుడు కొత్తది రాయగా చూళ్ళేదు" అన్న మా ఆవిడ కోసం, తన మొదటి (నా ఆవిడ గా ఆమె మొదటి) పుట్టిన రోజు నాడు రాసి ఇచ్చిన బహుమతి.. జాగ్రత్తగా దాసుకొన్న ఆ కాగితాన్ని వెదికి, ఇక్కడ పోస్ట్ చేస్తున్నా.! ఈ రోజు తో మా పెళ్లి జరిగి పదేళ్ళు. సందర్భానుసారం మరో సారి ఆమెకు ఇ- వెర్షన్ చూపించొచ్చు కదా. (కొన్ని మార్పులతో)!

పాదం కలిసినంత మాత్రాన నడక కాలేదు
మాట కలిపినంత మాత్రాన  పాట కాలేదు

వయసు బాట లోన కదిలిన వలపు అడుగులై,
కడలి అలలపై తేలిన నీటి బుడుగాలెన్నో
చెదిరిన ఆ గురుతులతో నీకై వేదుకులాటలెన్నో

నా నడకలో అడుగు అవుటకు
నా పాట లో మాట లు అల్లుటకు
నన్ను నన్ను గా ప్రేమెంచుటకు
నీకై వెదికినా గడపలెన్నో

ఏనాల్లో వేచిన హృదయం
ఒకటై కలిసిన ఉదయం
మనసే కావ్యమై,  మాటలు కరువై
ఒకరికి ఒకరు చేసుకొన్నా ప్రేమ ఒప్పందం

పదేళ్ళ పరుగులో
"ఇంతేనా", "ఇంతనా"
నేనింతే, నువ్వింతే
సర్డుకోవడమా, సర్దుకు  పోవడమా
చిరాకో పక్క, లెక్కలు మరో పక్క

నేనో ఉహల చిత్రాలతో ఉన్న చిక్కు ముడిని
తానో హద్దులు దాటని సరళ రేఖ (ఆమె పేరు రేఖ)
కాని...
ఇలా కాకుంటే..అని అలోచిన్చలేనంత
ఎవరు మారారో తెలుసుకోనంత
అద్భుత ప్రయాణం, మొదటి మైలు రాయి ని దాటి
ముందుకెలుతూ వెనక్కి చూసి మురిసిపోయే౦తా

(నన్ను నన్ను భరిస్తున్న నా జీవన రేఖ కోసం)


Friday, June 28, 2013

Beautiful Butterfly - మన లో సీతాకోక చిలక

(చెట్ల ఆకుల అడుగునో, కాండం లోపలో ఎక్కడో పెట్టబడిన గుడ్లు పొధగపడి గుంపులు, గుంపులు గా లార్వలు పుట్టుకొస్తాయి. రక, రకాల రంగులు, వాటిపై వెంట్రుకలు,   కొన్ని గూని నడక తో (సెమి లుపర్ అంటారు), గంగాలి పురుగులు గా మనకు ఎక్కువగా కనపడి, కంపరం కలిగిస్తుంటాయి. ఆకులను తి౦టునొ, కాండం పై, పుష్పాల పై, మొగ్గల పై రంద్రాలు చేసి వాటిని తింటూ పెరుగుతాయి...
...అలాంటి లార్వలన్ని అదే జీవితమని ఆగిపోతే..)

ఒకసారి, ఒక గొంగడి పురుగు కి కొత్త అనుమానం వచ్చింది. అదే సృష్టి రహస్యం అనుకోని అన్ని లార్వాలని సమావేశ పరిచి తన భోదన ప్రారంబించిది. "ఈ సృష్టి మన కోసమే పుట్టింది. మనం తినడానికే చెట్లు మొలుస్తున్నాయి, వాటికి అకులు పెరగడం మన కోసమే, వాటికీ పుట్టే మొగ్గలు, పువ్వులు, కాయలు మనకోసమే.. " అని వాదించింది.
అప్పటి నుండి లార్వలు తామే సృష్టి లో రారాజు లు అనుకోవడం మొదలు పెట్టాయి. అవి తిరిగే ప్రాంతం ఆకులూ అడుగు భాగమో, చెట్టు మొదల్లో చూస్తూ..ఈ సృష్టి మొత్తం తమ కోసమే అని నిర్ధారణకు వచ్చాయి.
తమంత అందంగా కూడా ఎవరు లేరని విశ్వసించడం మొదలుపెత్తాయి. మెల్లి మెల్లిగా అవి తామే అనడరికన్నా అందమైన సృష్టి అని అభిప్రాయానికి వచ్చేసాయి. అవన్నీ కలిసి తమలో అందంగా ఉంటుందనుకొన్న "గొంగళి పురుగు" ని రాజు గా చేసాయి. అదే గొప్ప జీవితం అని ఉహించుకొంటు గడుపుతున్నాయి. లార్వల జీవితం ముగిసి కకున్ (ప్యుపా) గా మారగానే వాటన్నింటిని సమాధి చేయడం మొదలుపెట్టాయి.   అవి అల నాశనం కావడమే మోక్షం అనుకోన్నాయి. గొంగళి పురుగే విరదివిరుడి గా ప్రకటించబడింది. ఎక్కువ వెంట్రుకలు ఉన్న పురుగులే అందమైనవిగా ముద్రపడి పోయింది.
ఇవన్ని అలా కాలం గడుపుతుండగా ఒక కకున్ (ప్యుపా) సమాధి కాకుండా తప్పించుక్కోంది. ఆ కకున్ లో నిద్రాణంగా ఉన్న లార్వలో మెల్లి మెల్లిగా మార్పులు రాసాగాయి. పొరలు, పొరలు గా చీలి రెక్కలు గా మారసాగాయి. దానికే తెలియని కొత్త అవయవాలు పుటసాగాయి.
ఒక వారం వ్యవధి లో "తనలో తానె, తనకు తానె" మార్చుకో సాగింది. బయటి ప్రపంచానికి ఇది తెలియదు. బయట వారికి ప్యుపా అంటే ఒక కదలిక లేని, సరైన ఆకారం లేని, నిర్జీవ పదార్థమే..
అలంటి ప్యుపా ఒక రోజు తన పైనున్న "పెంకును" చిల్చుకొని సీతాకోక చిలుక గా మారింది. అప్పుడు దానికొక విషయం అర్థమైనది.
"తన అసలైన రూపం నేలపై పాకే గొంగళి రూపం కాదు.."అందమైన రంగులతో శ్రద్దగా డిజైన్ చేసినట్టున్న రెక్కలు, పొడవైన కాళ్ళు, పుల మకరందం తీసుకోవడానికి వీలైన శరీర ఆకృతి తనదని తెలుస్కోంది".
ఆనందంగా రెక్కలు చాచి ఎగిరింది. అప్పుడది మరో విషయం కనుక్కోంది. "ప్రపంచం చాల పెద్దగా ఉంది. చాల అందంగా ఉంది. చెట్లు, చేమలు, మొక్కలే కాదు, లోకం లో చెరువులు, సెలయేళ్ళు, పక్షులు, అందమైన జీవులు, కొండలు, కోనలు లెక్కలేనన్ని అనంతమైన ఆకాశంతో సహా.." లోకం పెద్దగ, కొత్తగా, చెప్పలేనంతా అందంగా ఉంది".

తానూ కనుక్కొన్న విషయం మిగితా లార్వలకు చెప్పాలని బయలు దేరింది. ఆ లార్వలకు ఈ సీతాకోక చిలుక కొట్టగా కనపడింది. "ఏంటి వెంట్రుకలు లేవు. వెంట్రుకలు లేకుండా సిగ్గనిపించాట్లేడా?? ఆకులూ తినకుండా బ్రతికి ఎం ప్రయోజనం?? చెరువులు, కొత్త లోకం అంటూ పిచ్చి, పిచ్చి గా మాట్లాడుతుంది ఏంటి?? " అంటూ దాన్ని అవమానించాయి. అనుమానించాయి. కొన్నైతే ఇలాంటి వాటిని బ్రతకనివ్వ కూడదు. చంపేయాలి అని కూడా ఆవేశ పడ్డాయి.
సీతాకోక చిలక ఏంతో చెప్పాలని  ప్రయత్నించింది. ఇలా ప్యుపా ల దగ్గరే ఆగిపోతే తన జాతికి మనుగడ కూడా ఉండదని చెప్పి చూసింది.   కనీసం కొన్నిటిని అయిన ప్యుపా ని దాటి రమ్మని ప్రాదేయ పడింది. అప్పుడు కొన్ని మెత్తపడ్డాయి. కొన్ని కొద్ది రోజుల్లోనే నమ్మాయి. మిగిలినవి మరికొన్ని రోజుల్లో నిజం గ్రహించాయి. నమ్మనివి నశించిపోయాయి..
"మనకు ఇప్పుడున్న దశ శాశ్వతం కాదు. ఇంట కంటే మంచి భవిష్యత్తు ముందుంది. ఈ రెండింటి మధ్యలో ముఖ్యమైన మరో దశ ఉంది. అందరు అక్కడే ఆగిపోతారు.  అది దాటి మున్డుకేల్లిన వారిదే ప్రపంచం. అప్పుడు ప్రపంచం వారికోసం కొత్త ద్వారాలు తెరుస్తుంది.
మనం ఎదిగే దశలో మన చుట్టు ఉన్న వారు, చుట్టూ ఉన్న పరిస్థితులు మనపై పొరలు కప్పుతూ ఉంటాయి. ఆ పొరల మధ్యలో ఉండిపోతే కకున్ దశలోనే మగ్గిపోతాం.
అందుకే కకున్ ని చిల్చుకొనే ప్రయత్నం చేయాలి. లార్వ ప్రతి అవయవం మర్చుకోనట్టు, మనల్ని మనం మార్పుకి సిద్దం చేసుకోవాలి. అవసరమైతే మన అలవాట్లను,   నమ్మకాలను, భయాలను, బలహీనతలను సమూలంగా మార్చుకోవాలి.
నీలో మార్పు జరుగుతునప్పుడు నిన్ను ఎవరు గుర్తించకపోవచ్చు. ఎదుటి వ్యక్తీ అంగీకారం నికప్పుడు అనిపించవచ్చు. నీలోని సీతకొక చిలక ను నివు బయటకు తీసి పైకి దుసుకేల్లినప్పుడు నికే గుర్తింపు అవసరం ఉండదు. అందుకే నిన్ను నివు తరచి చూసుకో. నీలో ఏ శక్తి దాగుందో, నీలోని ఏ కోరిక నిన్ను ఉన్నత స్థాయి కి తిసుకెల్తుందో, నీలోని ఏ గుణం నీకు కొత్త గుర్తింపు తెస్తుందో తెలుసుకో! అందుకు నిన్ను నివే చదువుకో."




( నరేంద్ర గారు చెప్పిన "Revalution" అన్న ఇంగ్లీష్ కవిత కి తెలుగు సుత్తికరణ.

Tuesday, June 25, 2013

మేము, మా స్కూల్ మరియు నిజాముద్దీన్

కొంచం పెద్ద పోస్టే ..కాని మా స్కూల్ మిత్రులు ఎవరైనా చదువుతారేమో నని మరి వివరంగా రాసా......
"కీసరగుట్ట లో 83-89 మధ్య చదువుకొన్న ప్రతిఒక్కరికి గుర్తిండిపోయే ఒక పేరు - నిజాముద్దీన్.

అప్పుడు కీసరగుట్ట సిటి కి దూరంగా ఉన్న ఒక గుట్ట ప్రాంత౦. అక్కడ మా స్కూల్, వేద పాటశాల, గుడి తప్ప మరేమీ ఉండేది కాదు. మేము దాదాపు గా నాలుగు జిల్లాల లోని (అంటే వంద కిలో మీటర్ నుండి ఆ పైన) మారు మూలా గ్రామాల నుండి వచ్చిన వాళ్ళమే. వేసవి సెలవల తరువాత వస్తే, మల్లి దసరా సెలవులకే ఇంటికి చేరేది, ఇంట్లో వాళ్ళను చూసేది. ఎంత గొప్ప స్కూల్ అయిన, అన్ని వసతులు ఉన్నా, మంచి టీచర్స్ ఉన్న అప్పుడది మొదట్లో మాకొక జైలు లాగానే కనపడేది.. 
1983 లో డిసంబర్ లో అనుకొంటా., కొత్త పి.ఇ.టి. గా స్కూల్ లో జాయన్ అయ్యారు. అంతకుముందున్న గౌస్ దగ్గర నుండి బాధ్యత తీసుకొన్నాడు. మేము అప్పుడే అయిదవ తరగతి లో చేరి అయిదారు నెలలు అవుతుంది. మాకు గౌస్ గురించి పెద్దగ తెలియదు.
కాని, నిజాముద్దీన్ మా స్కూల్ జీవితం లో చాల పెద్ద పాత్ర పోషించాడు....పూర్తీ వ్యాసం కింది బ్లాగ్ లో.....
http://keesaragutta.blogspot.in/2013/06/blog-post.html

Tuesday, March 19, 2013

నాకోసం నేనే దేవుడవుతా


నాలో నేనే సత్యం వెతుక్కొంటా
నాకు నేనే దాసోహం అంటా
నాకోస౦ నేనే గర్వపడతా
నాకు నేనే నౌకరవుతా
నాకు నేనే శిష్యువుతా
నాకు నేనే భక్తువుతా
నాకోసం నేనే దేవువుతా

Friday, February 22, 2013

జనాలు, మానవులు మరియు వారి హక్కులు

మానవులు అంటే ఎవరు..??
కటోర శిక్షణ తీసుకోని, కనీసం పది మందిని బాంబులతో పెల్చగాలిగి ఉండాలి..
ఎవరి డబ్బులతో, శ్రమ తో ఏర్పడిన వ్యవస్థ లలో (బడులు, మౌలిక వసతులు) సౌకర్యాలు పొంది, విద్య బుద్దులు నేర్చుకొని, కొత్త కొత్త పన్నాగాలు పన్ని, అమాయకులను తీవ్రవాద ఉచ్చులో లాగి నర మేధానికి ప్రణాళిక పన్ని, పని నిర్వహించాగాలగాలి
ఎదో ఒక సిధ్ధాంటానికి లోబడి, ప్రజాస్వామ్యాన్ని తిడుతూ కనీసం ఒకరినైనా చంపి ఉండాలి

..వాల్లే మానవులు, వారికే మనవ హక్కులు ఉంటాయి..సామాన్యులు, వీటికి ఏమి సంభంధం లేని మామూలు జనాలు ..జనం అనే లెక్క మాత్రమె..! విరు "సామ్యవాద ఉచ్చులో పడ్డ" మూర్ఖులు మాత్రమె, విరు మనుషులు కాదు. తివ్రవాదులు చంపడానికి, ప్రతీకారం తీర్చుకోవడానికి కొంత "నంబర్" కావలి. అందుకు ఉన్న జనాలు.., సామాన్యులు..వారు మనుషులు కాదు. "జనసామన్యుల్లారా మీకు ఇలా జరగాల్సిందే"..ఎవడో ఎక్కడో ఎదో చేసాడు.., ఒకడు మసీదును కూల్చాడు, ఎదో సాది౦చినట్టు జండా ఎగరేసాడు, ఎవడో రైలు కి నిప్పు పెట్టాడు, దైవం స్వర్గం లో తన బర్త్ రిసర్వ్ చేసాడు అని పొంగి పోయాడు. అందుకోసమే, అందుకు ప్రతీకారంగా నిన్ను చంపుతారు, నివు హిందువా, అయితే అలా జరగాల్సిందే.., ముస్లింవా, మీరు కూడా చావాల్సిందే, మరో మతమా అయినా సరే నువ్వు చావాల్సిందే.!!  దాన్ని అర్థం చేసుకోవాలి. నివు మారాలి, ఎంతగా అంటే "చచ్చేంతగా".. రక్తం మరుగుతున్న నిది తప్పని తెలుసుకోవాలి. ని అభిప్రాయం మడిచి మింగేయాలి.
మనవ హక్కుల కాపలా దారులు కవిత్వం రాస్తున్నారు. మొన్న అఫ్జల్ గురుని చంపినందుకు భాదతో, అది వాళ్ళ ఇంటి వాళ్ళకు చెప్పలేకపోయరనే దారుణ పరిస్తితులున్న ప్రజాస్వామ్యం పై, కోపం తో, పార్లమెంట్ ఆరోజు కులిపోలేదన్న భాదతో కుమిలిపోతూ కవిత్వం రాస్తున్నారు..
రేపు మరో సారి ఎవరనినా పట్టుకొంటే, అప్పుడు గుర్తోస్త్తాయి "మనవ హక్కులు" .. ప్రజాస్వామ్య సౌకర్యాలు అనుభవిస్తూ .."మెజారిటి, మైనారిటీ, పాత లెక్కలు, కొత్త కారణాలు, చెత్త సిద్దంతాలు, అపోహలు, ఆరోపణలు" అంటూ జనాలను విడగోడుతూ, అతివాదానికి కూము కాస్తూ తిరిగే సామాజిక వృద్దులు, అతిఅవకాష వాదులు కొత్త ముసుగులోని తీవ్ర వాదులు..
(నోట్: మనకు కనపడుతున్న ప్రతి మనవ హక్కుల కాపలదరున్ని అనలేదు.., మొన్ననే ఆంధ్రజ్యోతిలో కవితలు రాసిన మేధావే ..ఇంతటి గోస కు కారణం..అంతే  కాదు ఇది చదివి మనోభావాలు దెబ్బతిసుకొనే అందరికోసం)

Friday, January 25, 2013

"Nothing" is possible..

who said "nothing is impossible"..
"nothing" is possible.! here is the example...

గత కొన్ని రోజులుగా, నెలలుగా, సంవత్సరాలుగా మన ప్రభుత్వ పెద్దలు, మంత్రులు, ఎం.ఎల్.ఎ లు, ఎం.పి లు ఇది నిరుపిస్తువస్తున్నారు. "తెలంగాణ" రావడం, పోవడం అనే మాయ మాటలతో కలక్షెపమ్ చేస్తూ.., డెల్లి ప్రయాణాలతో, విందు సమావేశాలతో కాలం గడిపేస్తున్నారు.

అది ఉద్యమం.., ప్రజలు, విద్యార్తులు తమంత తాముగా వచ్చి నిలబెట్టిన ఉద్యమం.అ ఉద్యమం ఉద్దేశ్యాలు, వాటి తప్పొప్పులు చర్చిన్చ్చేమో..కాని రాజకీయ నాయకులూ అవేమి చేయడం లేదు. ఉద్యమాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడానికి మాత్రమె ప్రయత్నిస్తున్నారు. పడువులతో ఉద్యమం చేయడం అంటే ప్రజా ధనంతో, ప్రజలిచ్చిన అధికారం తో పబ్బం గడుపుకోవడమే.. తమకు వచ్చే ప్లస్సులు, మైనస్సులు లేక్కేసుకోవడానికి మాత్రమె వాళ్ళు చేస్తున్నది.

రోజంతా వార్తలు అవే, పొద్దున్న లేస్తే ఒకరిని ఒకరు తిట్టుకోవడం, అది ఒక ఉద్యమ స్పూర్తితో కాకుండా, రాజకీయ లబ్ది కోసం, ప్రజలను పక్క దారి పట్టించటం కోసం మాత్రమె..లెక్కలేని వార్త చానల్ లు, చిరాకు పుట్టించే అంకర్ ఎక్ష్ప్రెషన్, అరుచుకోవడమే అసలు వాదన.,

అసలు మన వాళ్ళు ఇంతకూ తప్ప ఎం పనిచేస్తున్నారు...! అందుకే అన్నది "nothing" కూడా మనకు సాధ్యమే...

Wednesday, January 23, 2013

దేవుడు, మతం మరియు కమల్

"నాస్తికులుగా మాట్లదకండి. ఊరంతా మంచివాళ్ళే ఉన్నారు. వాళ్ళంతా దేవుళ్ళే" -సత్యమే శివం
"దేవుడుంటే బాగుండు..దేవుడు లేదని నేనేక్కదన్నాను??" -దశావతారం.

పై రెండు సినిమాలకు కథ, స్క్రీన్ ప్లే కమల్ అందించాడు. దేవుడు , మతానికి సంభందించిన అనేక విషయాలను చక్కగా చర్చించిన సినిమాలు. ఎక్కడ దేవుడి పై గాని, భక్తుల పై గాని, మాతాల పై గాని అసందర్భ విమర్శ లేని సినిమాలు. అదే సమయం లో తర్ఖిక ప్రశ్నలు లేవనెత్తి చర్చిస్తాడు (దశావతారం లో శైవ. వైష్ణ మతాల మధ్య ఒక సమయం లో ఉన్న వైరం, దాన్ని మూర్ఖంగా నమ్మిన ఇద్దరు స్నేహితుల వైరం, అవి నేటి సమాజానికి ఎంత అనవసరం అయ్యయో, ఎలా కొట్టుకుపోయాయో చెపుతాడు, అలానే సత్యమే శివం లో ఇద్దరు భక్తులు -నాజార్, మాధవన్ మధ్య నడిచిన ఒక నాస్తికుని, కమ్యునిస్ట్ భావజాలం ఉన్న ఒక వ్యక్తీ, అతని లో వచ్చిన మార్పు, అదే ఇతరులను ప్రేమ గా చూసే గుణం, దాన్నే దైవం అని చెప్పే ప్రయత్నం)
కమల్ గొప్ప నటుడు మాత్రమె కాదు. ఒక గొప్ప వ్యక్తిత్వం, గొప్ప ఆలోచనలు గల వ్యక్తీ. ఆతను ఒక నటుడు గానే కాదు, ఒక కొత్త ఆలోచనలను ప్రభావం చేయగల వ్యక్తీ గా మన సమాజానికి ఏంటో అవసరం. ఇప్పుడు సినిమాని ఆపేయమని గొడవ చేస్తున్నది..ఒక మతం వాళ్ళు గా కాకుండా.., మతాన్ని అడ్డుపెట్టుకొని ప్రచారం పొందాలని చుస్తున్నవారిగా అర్థం చేసుకోవాలి. ఇలా సినిమా ని ఆపటం వాళ్ళ, జరిగే ప్రయోజనం ఏమి లేదు. చూసేవాళ్ళు కచ్చితంగా చూస్తారు. ఇప్పుడు అనేక సాధనాలు.  కమల్ కి, నిర్మాతలకి (తన కుటుంభానికి) అది ఆర్థిక నష్టం తెస్తుందేమో కాని ఆతను చెప్పాల్సిన విషయాన్ని కచ్చితంగా చర్చకు వస్తుంది.అదే అతని ప్రయత్నం కనుక, అతడు సినిమా కి ముందే ఆ పని చేయగలిగాడు.

Tuesday, January 22, 2013

మంచి తనం మించిన దొరకదు - 2 (సత్యం చెప్పే మాట)

"నమ్మండి నాస్తికులుగ మాట్లాడకండి, ఊరంత చాల మంచి వాల్లు ఉన్నరు, వాల్లంత దేవుల్లె" -సత్యమే శివం లోని సత్యం చెప్పే చివరి డైలాగ్.
అలంటి దేవుడే "కళ్యాణ సుందరం"..

మనుషులను ఇప్పుడు రెండుగా విడగొట్టి చుస్తే., చెడ్డ వాళ్ళు, మరియు అమాయకులు గానో., చేతగాని వాళ్ళు, లౌక్యం గల వాళ్ళు గానో మాత్రమె విభజిస్తాము. ఎందుకంటే మంచివాళ్ళు మనకు అమాయకుల లాగానో, లౌక్యం గా బ్రతకటం చేతకాని వాళ్ళుగా మాత్రమె కనపడుతారు. "మంచి తనం" మన మధ్యలో మాత్రమె తిరుగుతుంటే నమ్మశక్యం కాదు. 
"కళ్యాణ సుందరం" లైబ్రేరియన్ గా పని చేసి ఈ మధ్యే పదవి విరమణ చేసాడు. పది లక్షలకు పైగా "రిటైర్మెంట్ బెనిఫిట్స్" పొందాడు. అయితే అతని గొప్పతనం ఏంటంటే అందులో ఒక్క పైసా తన కోసం ఉంచుకోలేదు. మొత్తం దాన ధర్మాలకు ఇచ్చేసాడు. అలంటి వాళ్ళు చాల మంది ఉండే ఉంటారు అంటారా??? 
ఆయన మరో గొప్పతనం, ఎవరు అందుకోలేని మహోన్నత వ్యక్తిత్వం ఏంటంటే.. ఇంత వరకు తన జీతం మొత్తం, ఇప్పటి వరకు తనకు వచ్చిన ప్రతి పైసా, కష్ట పది పని చేస్తే వచ్చిన జీతం మొత్తం ఇలాంటి దాన ధర్మాలకు వినియోగించాడు. తన అవసరాల కోసం విడిగా హోటల్ లలో సర్వర్ గా పని చేసి సంపాదించాడు. అలా సర్వర్ గా పని చేస్తూ వచ్చిన డబ్బులు మాత్రమె తన కోసం వాడుకొన్నాడు.
ప్రపంచం మొత్తం లో ఇలా సంపాదన మొత్తం మంచి కార్యక్రమాలకు వినియోగించిన ఏకైక వ్యక్తీ, "కళ్యాణ సుందరం". U.N.O. ఇది గుర్తించింది. అమెరికాలోని ఒక  అతన్ని "మాన్ ఆఫ్ మిలీనియం" బిరుదును కొంత నగుదు ని అతనికి బహుకరించింది. మల్లి ఇతను ఆ బహుమతి మొత్తాన్ని(ఎంత..ముప్పై కోట్లే) చారిటి కే ఉపయోగించాడు. అతను "పాలం" అనే సంస్థ ద్వార సమాజ సేవ కార్యక్రమాలు చేస్తున్నాడు. ఇప్పటికి రోడ్డు పైనో, ప్లాట్ ఫాం పైనో పడు కోవడానికి అతనికి ఎ భాధ ఉండదు. అలా ఉంటేనే అసలైన పేదల భాద తెలుస్తుంది అంతాడు. ఇండో-చైనా యుద్ధం మొదలైనప్పుడు మొదలైన ఈ సేవ కార్యక్రమాల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది. రజినీకాంత్ ఇతన్ని "తండ్రి" గా దత్తత తీసుకొన్నాడు. అప్పుడు కాని పత్రికలకు ఆతను "వార్తా" కాలేదు.
ఉద్యోగి గా, జీతం కోసం, జీతం పెరగడం కోసం, అందుకు చేసే బంద్ ల కోసం, పే కమిషన్ లెక్కల కోసం, అధికారం కోసం, ప్రమోషన్ కోసం, అహంకారం కోసం (ప్రభుత్వ ఉద్యోగి అనే), అవినీతికి దొరికే అవకాశం కోసం పనిచేయడం ఇప్పటి లౌక్యానికి, తెలివికి మనం ఇచ్చే నిర్వచనం. కాదంటారా..
కాదనండి..చుట్టూ చుడండి. ఇలాంటి వాళ్ళు ఎందఱో ఉన్నారు. మంచి తనం ను మించినది లేదనే సిద్దాంతం మిద నిలబడే, బ్రతికున్న దేవుళ్ళు.. హోటల్లో కాన పడే సర్వర్ కావచ్చు, రిక్షా నడిపే కార్మికుడు కావచ్చు, రోడ్డు పక్కన అడుక్కొనే బిచ్చగాడు కావచ్చు, రోడ్డు మద్యలో నిలబడ్డ ట్రాఫిక్ పోలిస్ కావచ్చు, కార్లలో తిరిగే దొరబాబు కావచ్చు.. మంచితనం పంచుతూ తిరుగుతూ ఉండొచ్చు. అనుమానపు కళ్ళద్దాలు ఉంటేనే ఈ లోకం లో బతక గలమనే పిరికి తనం వదిలిన్చుకొంటే..లోకం మరింత అందంగా.., కొత్తగా కనపడుతోంది.  ఇదే "సత్యమే శివం" సూత్రం.
  http://www.hindu.com/thehindu/mp/2003/04/23/stories/2003042300060300.htm

Wednesday, January 9, 2013

దేఖో అక్భర్ సాబ్..! రాజకీయానికి మరో దారి ఉంది

మాట్లాడుకోవడానికి మనకు మంచి మాటలు ఇంకా మిగిలే ఉన్నాయి. మంచి మాట్లాడేవాళ్ళు ఉన్నారు. అక్బరుద్దీన్ తన మనుగడ కోసం, రాజకీయ లబ్ది కోసం అన్న మాటలు అతననుకొన్న ప్రతాపం, ప్రకోపం చూపించలేదు. అందుకు కారణం అందరు అలాంటివాళ్ళు కాకపోవటమే. నీలాంటి వాళ్ళు ఇంకా తెగపడ్డ దారుణాలు జరగవు అని చెప్పారు ..ఎందుకంటే...

మాకు దసరా జమ్మి ఎంత తెలుసో, పిరిలా పండుగ అంత తెలుసు
గుడికి, దర్గాకి తేడ తెలియక పెరుగాము
చిన్నోడికి కడుపునొప్పి వస్తే పీర్ సాబ్ దగ్గరికి పోయాము
ఖాజా సాబ్ కి జమ్మి ఇచ్చి కాలు మొక్కం
గణేష్ నిమజ్జన్నైకి రావాడానికి "భాష" కి అడ్డేమి లేదు
వాళ్ళంతా వేరే మతం అని పెరగలేదు..,మా లాగానే వాళ్ళది మరో కులం అనే అనుకొన్నారు
అల్లుడు అన్నారు, బావ అని మా బాపు ని పిలిచారు
నికేమి తెలియక పోవచ్చు..నివు చదివింది, పెరిగింది ఇక్కడ కాకపోవచ్చు.
పిరులు ఎత్తడం నేర్చుకో, దర్గా లా చుట్టూ ఏముందో చూడు..
రాజకీయానికి మరో దారి కూడా ఉంది.., దగ్గరికి వెళ్లి చూడు
దగ్గరికి వెళ్లి చూడు
మసీదుల్లో నే కాదు., మనుషుల్లోనూ అల్లా ఉన్నాడు