Friday, June 28, 2013

Beautiful Butterfly - మన లో సీతాకోక చిలక

(చెట్ల ఆకుల అడుగునో, కాండం లోపలో ఎక్కడో పెట్టబడిన గుడ్లు పొధగపడి గుంపులు, గుంపులు గా లార్వలు పుట్టుకొస్తాయి. రక, రకాల రంగులు, వాటిపై వెంట్రుకలు,   కొన్ని గూని నడక తో (సెమి లుపర్ అంటారు), గంగాలి పురుగులు గా మనకు ఎక్కువగా కనపడి, కంపరం కలిగిస్తుంటాయి. ఆకులను తి౦టునొ, కాండం పై, పుష్పాల పై, మొగ్గల పై రంద్రాలు చేసి వాటిని తింటూ పెరుగుతాయి...
...అలాంటి లార్వలన్ని అదే జీవితమని ఆగిపోతే..)

ఒకసారి, ఒక గొంగడి పురుగు కి కొత్త అనుమానం వచ్చింది. అదే సృష్టి రహస్యం అనుకోని అన్ని లార్వాలని సమావేశ పరిచి తన భోదన ప్రారంబించిది. "ఈ సృష్టి మన కోసమే పుట్టింది. మనం తినడానికే చెట్లు మొలుస్తున్నాయి, వాటికి అకులు పెరగడం మన కోసమే, వాటికీ పుట్టే మొగ్గలు, పువ్వులు, కాయలు మనకోసమే.. " అని వాదించింది.
అప్పటి నుండి లార్వలు తామే సృష్టి లో రారాజు లు అనుకోవడం మొదలు పెట్టాయి. అవి తిరిగే ప్రాంతం ఆకులూ అడుగు భాగమో, చెట్టు మొదల్లో చూస్తూ..ఈ సృష్టి మొత్తం తమ కోసమే అని నిర్ధారణకు వచ్చాయి.
తమంత అందంగా కూడా ఎవరు లేరని విశ్వసించడం మొదలుపెత్తాయి. మెల్లి మెల్లిగా అవి తామే అనడరికన్నా అందమైన సృష్టి అని అభిప్రాయానికి వచ్చేసాయి. అవన్నీ కలిసి తమలో అందంగా ఉంటుందనుకొన్న "గొంగళి పురుగు" ని రాజు గా చేసాయి. అదే గొప్ప జీవితం అని ఉహించుకొంటు గడుపుతున్నాయి. లార్వల జీవితం ముగిసి కకున్ (ప్యుపా) గా మారగానే వాటన్నింటిని సమాధి చేయడం మొదలుపెట్టాయి.   అవి అల నాశనం కావడమే మోక్షం అనుకోన్నాయి. గొంగళి పురుగే విరదివిరుడి గా ప్రకటించబడింది. ఎక్కువ వెంట్రుకలు ఉన్న పురుగులే అందమైనవిగా ముద్రపడి పోయింది.
ఇవన్ని అలా కాలం గడుపుతుండగా ఒక కకున్ (ప్యుపా) సమాధి కాకుండా తప్పించుక్కోంది. ఆ కకున్ లో నిద్రాణంగా ఉన్న లార్వలో మెల్లి మెల్లిగా మార్పులు రాసాగాయి. పొరలు, పొరలు గా చీలి రెక్కలు గా మారసాగాయి. దానికే తెలియని కొత్త అవయవాలు పుటసాగాయి.
ఒక వారం వ్యవధి లో "తనలో తానె, తనకు తానె" మార్చుకో సాగింది. బయటి ప్రపంచానికి ఇది తెలియదు. బయట వారికి ప్యుపా అంటే ఒక కదలిక లేని, సరైన ఆకారం లేని, నిర్జీవ పదార్థమే..
అలంటి ప్యుపా ఒక రోజు తన పైనున్న "పెంకును" చిల్చుకొని సీతాకోక చిలుక గా మారింది. అప్పుడు దానికొక విషయం అర్థమైనది.
"తన అసలైన రూపం నేలపై పాకే గొంగళి రూపం కాదు.."అందమైన రంగులతో శ్రద్దగా డిజైన్ చేసినట్టున్న రెక్కలు, పొడవైన కాళ్ళు, పుల మకరందం తీసుకోవడానికి వీలైన శరీర ఆకృతి తనదని తెలుస్కోంది".
ఆనందంగా రెక్కలు చాచి ఎగిరింది. అప్పుడది మరో విషయం కనుక్కోంది. "ప్రపంచం చాల పెద్దగా ఉంది. చాల అందంగా ఉంది. చెట్లు, చేమలు, మొక్కలే కాదు, లోకం లో చెరువులు, సెలయేళ్ళు, పక్షులు, అందమైన జీవులు, కొండలు, కోనలు లెక్కలేనన్ని అనంతమైన ఆకాశంతో సహా.." లోకం పెద్దగ, కొత్తగా, చెప్పలేనంతా అందంగా ఉంది".

తానూ కనుక్కొన్న విషయం మిగితా లార్వలకు చెప్పాలని బయలు దేరింది. ఆ లార్వలకు ఈ సీతాకోక చిలుక కొట్టగా కనపడింది. "ఏంటి వెంట్రుకలు లేవు. వెంట్రుకలు లేకుండా సిగ్గనిపించాట్లేడా?? ఆకులూ తినకుండా బ్రతికి ఎం ప్రయోజనం?? చెరువులు, కొత్త లోకం అంటూ పిచ్చి, పిచ్చి గా మాట్లాడుతుంది ఏంటి?? " అంటూ దాన్ని అవమానించాయి. అనుమానించాయి. కొన్నైతే ఇలాంటి వాటిని బ్రతకనివ్వ కూడదు. చంపేయాలి అని కూడా ఆవేశ పడ్డాయి.
సీతాకోక చిలక ఏంతో చెప్పాలని  ప్రయత్నించింది. ఇలా ప్యుపా ల దగ్గరే ఆగిపోతే తన జాతికి మనుగడ కూడా ఉండదని చెప్పి చూసింది.   కనీసం కొన్నిటిని అయిన ప్యుపా ని దాటి రమ్మని ప్రాదేయ పడింది. అప్పుడు కొన్ని మెత్తపడ్డాయి. కొన్ని కొద్ది రోజుల్లోనే నమ్మాయి. మిగిలినవి మరికొన్ని రోజుల్లో నిజం గ్రహించాయి. నమ్మనివి నశించిపోయాయి..
"మనకు ఇప్పుడున్న దశ శాశ్వతం కాదు. ఇంట కంటే మంచి భవిష్యత్తు ముందుంది. ఈ రెండింటి మధ్యలో ముఖ్యమైన మరో దశ ఉంది. అందరు అక్కడే ఆగిపోతారు.  అది దాటి మున్డుకేల్లిన వారిదే ప్రపంచం. అప్పుడు ప్రపంచం వారికోసం కొత్త ద్వారాలు తెరుస్తుంది.
మనం ఎదిగే దశలో మన చుట్టు ఉన్న వారు, చుట్టూ ఉన్న పరిస్థితులు మనపై పొరలు కప్పుతూ ఉంటాయి. ఆ పొరల మధ్యలో ఉండిపోతే కకున్ దశలోనే మగ్గిపోతాం.
అందుకే కకున్ ని చిల్చుకొనే ప్రయత్నం చేయాలి. లార్వ ప్రతి అవయవం మర్చుకోనట్టు, మనల్ని మనం మార్పుకి సిద్దం చేసుకోవాలి. అవసరమైతే మన అలవాట్లను,   నమ్మకాలను, భయాలను, బలహీనతలను సమూలంగా మార్చుకోవాలి.
నీలో మార్పు జరుగుతునప్పుడు నిన్ను ఎవరు గుర్తించకపోవచ్చు. ఎదుటి వ్యక్తీ అంగీకారం నికప్పుడు అనిపించవచ్చు. నీలోని సీతకొక చిలక ను నివు బయటకు తీసి పైకి దుసుకేల్లినప్పుడు నికే గుర్తింపు అవసరం ఉండదు. అందుకే నిన్ను నివు తరచి చూసుకో. నీలో ఏ శక్తి దాగుందో, నీలోని ఏ కోరిక నిన్ను ఉన్నత స్థాయి కి తిసుకెల్తుందో, నీలోని ఏ గుణం నీకు కొత్త గుర్తింపు తెస్తుందో తెలుసుకో! అందుకు నిన్ను నివే చదువుకో."




( నరేంద్ర గారు చెప్పిన "Revalution" అన్న ఇంగ్లీష్ కవిత కి తెలుగు సుత్తికరణ.

Tuesday, June 25, 2013

మేము, మా స్కూల్ మరియు నిజాముద్దీన్

కొంచం పెద్ద పోస్టే ..కాని మా స్కూల్ మిత్రులు ఎవరైనా చదువుతారేమో నని మరి వివరంగా రాసా......
"కీసరగుట్ట లో 83-89 మధ్య చదువుకొన్న ప్రతిఒక్కరికి గుర్తిండిపోయే ఒక పేరు - నిజాముద్దీన్.

అప్పుడు కీసరగుట్ట సిటి కి దూరంగా ఉన్న ఒక గుట్ట ప్రాంత౦. అక్కడ మా స్కూల్, వేద పాటశాల, గుడి తప్ప మరేమీ ఉండేది కాదు. మేము దాదాపు గా నాలుగు జిల్లాల లోని (అంటే వంద కిలో మీటర్ నుండి ఆ పైన) మారు మూలా గ్రామాల నుండి వచ్చిన వాళ్ళమే. వేసవి సెలవల తరువాత వస్తే, మల్లి దసరా సెలవులకే ఇంటికి చేరేది, ఇంట్లో వాళ్ళను చూసేది. ఎంత గొప్ప స్కూల్ అయిన, అన్ని వసతులు ఉన్నా, మంచి టీచర్స్ ఉన్న అప్పుడది మొదట్లో మాకొక జైలు లాగానే కనపడేది.. 
1983 లో డిసంబర్ లో అనుకొంటా., కొత్త పి.ఇ.టి. గా స్కూల్ లో జాయన్ అయ్యారు. అంతకుముందున్న గౌస్ దగ్గర నుండి బాధ్యత తీసుకొన్నాడు. మేము అప్పుడే అయిదవ తరగతి లో చేరి అయిదారు నెలలు అవుతుంది. మాకు గౌస్ గురించి పెద్దగ తెలియదు.
కాని, నిజాముద్దీన్ మా స్కూల్ జీవితం లో చాల పెద్ద పాత్ర పోషించాడు....పూర్తీ వ్యాసం కింది బ్లాగ్ లో.....
http://keesaragutta.blogspot.in/2013/06/blog-post.html