Tuesday, January 22, 2013

మంచి తనం మించిన దొరకదు - 2 (సత్యం చెప్పే మాట)

"నమ్మండి నాస్తికులుగ మాట్లాడకండి, ఊరంత చాల మంచి వాల్లు ఉన్నరు, వాల్లంత దేవుల్లె" -సత్యమే శివం లోని సత్యం చెప్పే చివరి డైలాగ్.
అలంటి దేవుడే "కళ్యాణ సుందరం"..

మనుషులను ఇప్పుడు రెండుగా విడగొట్టి చుస్తే., చెడ్డ వాళ్ళు, మరియు అమాయకులు గానో., చేతగాని వాళ్ళు, లౌక్యం గల వాళ్ళు గానో మాత్రమె విభజిస్తాము. ఎందుకంటే మంచివాళ్ళు మనకు అమాయకుల లాగానో, లౌక్యం గా బ్రతకటం చేతకాని వాళ్ళుగా మాత్రమె కనపడుతారు. "మంచి తనం" మన మధ్యలో మాత్రమె తిరుగుతుంటే నమ్మశక్యం కాదు. 
"కళ్యాణ సుందరం" లైబ్రేరియన్ గా పని చేసి ఈ మధ్యే పదవి విరమణ చేసాడు. పది లక్షలకు పైగా "రిటైర్మెంట్ బెనిఫిట్స్" పొందాడు. అయితే అతని గొప్పతనం ఏంటంటే అందులో ఒక్క పైసా తన కోసం ఉంచుకోలేదు. మొత్తం దాన ధర్మాలకు ఇచ్చేసాడు. అలంటి వాళ్ళు చాల మంది ఉండే ఉంటారు అంటారా??? 
ఆయన మరో గొప్పతనం, ఎవరు అందుకోలేని మహోన్నత వ్యక్తిత్వం ఏంటంటే.. ఇంత వరకు తన జీతం మొత్తం, ఇప్పటి వరకు తనకు వచ్చిన ప్రతి పైసా, కష్ట పది పని చేస్తే వచ్చిన జీతం మొత్తం ఇలాంటి దాన ధర్మాలకు వినియోగించాడు. తన అవసరాల కోసం విడిగా హోటల్ లలో సర్వర్ గా పని చేసి సంపాదించాడు. అలా సర్వర్ గా పని చేస్తూ వచ్చిన డబ్బులు మాత్రమె తన కోసం వాడుకొన్నాడు.
ప్రపంచం మొత్తం లో ఇలా సంపాదన మొత్తం మంచి కార్యక్రమాలకు వినియోగించిన ఏకైక వ్యక్తీ, "కళ్యాణ సుందరం". U.N.O. ఇది గుర్తించింది. అమెరికాలోని ఒక  అతన్ని "మాన్ ఆఫ్ మిలీనియం" బిరుదును కొంత నగుదు ని అతనికి బహుకరించింది. మల్లి ఇతను ఆ బహుమతి మొత్తాన్ని(ఎంత..ముప్పై కోట్లే) చారిటి కే ఉపయోగించాడు. అతను "పాలం" అనే సంస్థ ద్వార సమాజ సేవ కార్యక్రమాలు చేస్తున్నాడు. ఇప్పటికి రోడ్డు పైనో, ప్లాట్ ఫాం పైనో పడు కోవడానికి అతనికి ఎ భాధ ఉండదు. అలా ఉంటేనే అసలైన పేదల భాద తెలుస్తుంది అంతాడు. ఇండో-చైనా యుద్ధం మొదలైనప్పుడు మొదలైన ఈ సేవ కార్యక్రమాల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది. రజినీకాంత్ ఇతన్ని "తండ్రి" గా దత్తత తీసుకొన్నాడు. అప్పుడు కాని పత్రికలకు ఆతను "వార్తా" కాలేదు.
ఉద్యోగి గా, జీతం కోసం, జీతం పెరగడం కోసం, అందుకు చేసే బంద్ ల కోసం, పే కమిషన్ లెక్కల కోసం, అధికారం కోసం, ప్రమోషన్ కోసం, అహంకారం కోసం (ప్రభుత్వ ఉద్యోగి అనే), అవినీతికి దొరికే అవకాశం కోసం పనిచేయడం ఇప్పటి లౌక్యానికి, తెలివికి మనం ఇచ్చే నిర్వచనం. కాదంటారా..
కాదనండి..చుట్టూ చుడండి. ఇలాంటి వాళ్ళు ఎందఱో ఉన్నారు. మంచి తనం ను మించినది లేదనే సిద్దాంతం మిద నిలబడే, బ్రతికున్న దేవుళ్ళు.. హోటల్లో కాన పడే సర్వర్ కావచ్చు, రిక్షా నడిపే కార్మికుడు కావచ్చు, రోడ్డు పక్కన అడుక్కొనే బిచ్చగాడు కావచ్చు, రోడ్డు మద్యలో నిలబడ్డ ట్రాఫిక్ పోలిస్ కావచ్చు, కార్లలో తిరిగే దొరబాబు కావచ్చు.. మంచితనం పంచుతూ తిరుగుతూ ఉండొచ్చు. అనుమానపు కళ్ళద్దాలు ఉంటేనే ఈ లోకం లో బతక గలమనే పిరికి తనం వదిలిన్చుకొంటే..లోకం మరింత అందంగా.., కొత్తగా కనపడుతోంది.  ఇదే "సత్యమే శివం" సూత్రం.
  http://www.hindu.com/thehindu/mp/2003/04/23/stories/2003042300060300.htm

1 comment:

Unknown said...

కృతజ్ఞ తలు!! మంచి టపా రాసారు. కానీ, మంచితనాన్ని చేతకాని తనంగా చూసే సమాజంలో మనం ఉన్నామని మీకు అనిపించటం లేదా?