Thursday, March 1, 2012

ఏందీ లొల్లి ..అనబడే 26 వ రాజకీయ భేతాళ కథ (పంచ వింశతి కథ లకు మరొకటి)

"ముళ్ళపూడి" గారి రాజు గారు, రెడ్డి గారు ఎప్పుడో పోయారు. రాజు గారి రాజకీయ కథ లు విన్న రెడ్డి గారు హాయిగా విశ్రాంతి తీసుకోగా., రాజు గారు పనిలేక తన మేధస్సు నంత తన వంశానికి ధారపోసి, పోసి పోయారు. ఆ రాజు గారి మనవడు ఒక రోజు ఒక  సందర్శిని లో టీ తాగుతుండగా...
"రాజు ! ఒక అకాసానికి ఇద్దరు చంద్రులు అవసరం అంటావా" అని ప్రశ్న వినపడే సరికి రాజు గారి మనవడు, రాజు అనే మన పాత్రధరి ఆలోచనలో పడ్డాడు, "అనవసరం" అనే సమాధానం ఉహించి అడిగిన ఆ ప్రశ్నాకి ఏమి సమాధానం చెప్పల అని.
"ఈ ప్రశ్నఅవసరమా సీను" అని చెప్ప గలిగాడు మన రాజు.
తరువాత రాజు, సీను ల మధ్య సిన్ ఈ విదంగా నడిచింది.
" అది కాదు, అసలు ఉంటాయ అని"
" ఎందుకు ఉండవు, అమావాస్య చంద్రుడు, పున్నమి చంద్రుడు.., ఇలా రక రకాలుగా.."
"కాని కలిసి ఒకే దగ్గర ఒకే సారి ఉండవు కదా.."
"అభ్బో! బాగా చెప్పావు., సరే ఎందుకు రెండు చంద్రులు అనవసరమో చెప్పు, అయిన ఈ చంద్రుల గోలేంటి"
"అక్కడ ., ఆ టి.వి చూడు."
టి. వి చానల్ ని మధ్యకి చీల్చి శేఖరుడిని, బాబుని చూపిస్తున్నారు
"నిజమే సీను.. ఇద్దరు అనవసరమేమో, ఈ ఇద్దరు అనవసరమేమో" 
"వీళ్ళు కాకా మనకి ఎవరున్నారు.. రాజు గారి కొడుకు ఎవరిని తిడుతున్నాడో, ఆయనను ఎవరు తిడుతున్నారో అర్థం కవట్లేదే?"
"అయిన మాట్లాడేది ఏది అర్థం కాదులే, దానికో saperate మత భాష ఉంది"
"ఇంతకూ లు_, లఫా_, లత్క్__ ఎవరు అంటావు." (వాళ్ళు మాట్లాడిన, టి.వి వాలు చూపించిన, పేపర్ వాళ్ళు రాసిన, నాకు రాయడానికి, మీకు చదవడానికి ఇబ్బంది అని...)
"ఎవరైనా సరే!  అందరిని అసెంబ్లీ పంపించాం., భయట ఎవరు మిగలలేదు" 
"అయితే ఎవరు ప్రతి పక్షం, ఎవరు అధికార పక్షం, ఎవరు స్వపక్షం , ఎవరు విపక్షం, ఎవరు ఎవరిని తిడుతున్నారు, ఎవరు ఎవరిని పొగుడుతున్నారు,
ఎవరిదీ వేర్పాటు వాదం, ఎవరిదీ వితండ వాదం, ఎవరితో ఎవరు ఎందుకు కుముక్కయ్యారు.
అది తెలిసి చెప్పక పోయావో ఇదే హోటల్ లో మరో టి తగిపిస్తా, అదే టి.వి. చూపిస్తా.అప్పుడు నీ తల వెయ్యి జండుబం లకు తగ్గానంత గ పగిలి పోతుంది.."
" ఆపు. నా తల already veyinara mukkalayindi. సరే నా సమాధానం విను"
" అందరు విపక్షమే, ఎవరు ప్రజా పక్షం లో లేరు
ఎవరు ఎవరినైనా తిట్టవచ్చు. రేపు వల్లే వరిని  గొప్పగా పొగడ వచ్చు. ఏ రోజు వార్తాలు ఆ రోజే మర్చిపోయే విదంగా మన ప్రజలకు గొప్ప తర్పిదు ఇచ్చారు.. టి.వి. చానల్స్ ద్వారా!
 అందరిది ఒకటే వాదం. తమ వారికే అధికారం కావాలనే విధానం. వేర్పాటు వాదం, కుల వాదం, అభివ్రుది వాదం, సమైక్య రాగం, ఇలా అన్ని వాదాలు ఒకే విధానం లోని వేర్వేరు దారాలు.., దారులు. అవన్నీ సీటు కోసం పడే కోటి తిప్పలు, చేసే కొటినర తప్పులు., లోక కళ్యాణం లో అవన్నీ ఒప్పులు"
టి tagaDam ayipoyinanduna రాజు kappu kinda petti తన soda muginchadu.
" రాజు! నా చివరి ప్రశ్నఅన్న కి సమాధానం చెప్పలేదు, ఎవరు ఎవరితో కుముక్కయ్యారు. సేకర దొర, రాజు  గారి అబ్బాయితోన, బాబు గారు కిరానుడితోన , narayana, mental hospital varitona, Jprakasham గారు బాబు గారి పక్కవారి తోనా, ఆగం గారు దొర బిడ్డలా తోనా..చిరు జీవుడు రాజ్య సభ సీటు తోనా, జ్యోతి వాళు సి. బి. ఐ తోనా, ఈనాడు tv9  తోనా, తొందరగా చెప్పు, లేకపోతె నేను ఇంకో టి చెపుతా..!"
" అందరు కలిసి కుముక్కయారు. ఎవరిపైనా ప్రజలకు గౌరవం లేదని వాళ్లకి అర్థం అయింది, ఇప్పట్లో ఎన్నికలు రావు, రాకూడదు, ఒకరి తప్పు నీ ఇంకొకరి మిద రుద్దాలి.., అది తెలిసి అందరు "ప్రజలు" వ్యతిరేకంగా కుముక్కయారు"
"అదిగో బస్సు.. ఇది పొతే మరొకటి దొరకదు" అంటూ ...
పరిగెత్తి.., "రాజధాని ఎక్ష్ప్రెస్స్" బస్సెక్కి సిద్ధిపేట నుండి హైదరాబాద్ బయలు దేరారు.
(చదువరులకు ప్రార్తన: ముళ్ళపూడి వారి కథలు చదువుతూ అదే స్పూర్తి లో రాయాలనే అత్యాస తోటి, రాయగలననే కకుర్తి తోటి రాసింది. చిరాకు అనిపించినప్పుడల్లా క్సమించమని ప్రార్తన, మోతమంతా చిరాకే అంటే సినిన్మోహన్ బాబు గారి కి చెప్పుతా)