Friday, February 22, 2013
Friday, January 25, 2013
"Nothing" is possible..
who said "nothing is impossible"..
"nothing" is possible.! here is the example...
గత కొన్ని రోజులుగా, నెలలుగా, సంవత్సరాలుగా మన ప్రభుత్వ పెద్దలు, మంత్రులు, ఎం.ఎల్.ఎ లు, ఎం.పి లు ఇది నిరుపిస్తువస్తున్నారు. "తెలంగాణ" రావడం, పోవడం అనే మాయ మాటలతో కలక్షెపమ్ చేస్తూ.., డెల్లి ప్రయాణాలతో, విందు సమావేశాలతో కాలం గడిపేస్తున్నారు.
అది ఉద్యమం.., ప్రజలు, విద్యార్తులు తమంత తాముగా వచ్చి నిలబెట్టిన ఉద్యమం.అ ఉద్యమం ఉద్దేశ్యాలు, వాటి తప్పొప్పులు చర్చిన్చ్చేమో..కాని రాజకీయ నాయకులూ అవేమి చేయడం లేదు. ఉద్యమాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడానికి మాత్రమె ప్రయత్నిస్తున్నారు. పడువులతో ఉద్యమం చేయడం అంటే ప్రజా ధనంతో, ప్రజలిచ్చిన అధికారం తో పబ్బం గడుపుకోవడమే.. తమకు వచ్చే ప్లస్సులు, మైనస్సులు లేక్కేసుకోవడానికి మాత్రమె వాళ్ళు చేస్తున్నది.
రోజంతా వార్తలు అవే, పొద్దున్న లేస్తే ఒకరిని ఒకరు తిట్టుకోవడం, అది ఒక ఉద్యమ స్పూర్తితో కాకుండా, రాజకీయ లబ్ది కోసం, ప్రజలను పక్క దారి పట్టించటం కోసం మాత్రమె..లెక్కలేని వార్త చానల్ లు, చిరాకు పుట్టించే అంకర్ ఎక్ష్ప్రెషన్, అరుచుకోవడమే అసలు వాదన.,
అసలు మన వాళ్ళు ఇంతకూ తప్ప ఎం పనిచేస్తున్నారు...! అందుకే అన్నది "nothing" కూడా మనకు సాధ్యమే...
"nothing" is possible.! here is the example...
గత కొన్ని రోజులుగా, నెలలుగా, సంవత్సరాలుగా మన ప్రభుత్వ పెద్దలు, మంత్రులు, ఎం.ఎల్.ఎ లు, ఎం.పి లు ఇది నిరుపిస్తువస్తున్నారు. "తెలంగాణ" రావడం, పోవడం అనే మాయ మాటలతో కలక్షెపమ్ చేస్తూ.., డెల్లి ప్రయాణాలతో, విందు సమావేశాలతో కాలం గడిపేస్తున్నారు.
అది ఉద్యమం.., ప్రజలు, విద్యార్తులు తమంత తాముగా వచ్చి నిలబెట్టిన ఉద్యమం.అ ఉద్యమం ఉద్దేశ్యాలు, వాటి తప్పొప్పులు చర్చిన్చ్చేమో..కాని రాజకీయ నాయకులూ అవేమి చేయడం లేదు. ఉద్యమాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడానికి మాత్రమె ప్రయత్నిస్తున్నారు. పడువులతో ఉద్యమం చేయడం అంటే ప్రజా ధనంతో, ప్రజలిచ్చిన అధికారం తో పబ్బం గడుపుకోవడమే.. తమకు వచ్చే ప్లస్సులు, మైనస్సులు లేక్కేసుకోవడానికి మాత్రమె వాళ్ళు చేస్తున్నది.
రోజంతా వార్తలు అవే, పొద్దున్న లేస్తే ఒకరిని ఒకరు తిట్టుకోవడం, అది ఒక ఉద్యమ స్పూర్తితో కాకుండా, రాజకీయ లబ్ది కోసం, ప్రజలను పక్క దారి పట్టించటం కోసం మాత్రమె..లెక్కలేని వార్త చానల్ లు, చిరాకు పుట్టించే అంకర్ ఎక్ష్ప్రెషన్, అరుచుకోవడమే అసలు వాదన.,
అసలు మన వాళ్ళు ఇంతకూ తప్ప ఎం పనిచేస్తున్నారు...! అందుకే అన్నది "nothing" కూడా మనకు సాధ్యమే...
Wednesday, January 23, 2013
దేవుడు, మతం మరియు కమల్
"నాస్తికులుగా మాట్లదకండి. ఊరంతా మంచివాళ్ళే ఉన్నారు. వాళ్ళంతా దేవుళ్ళే" -సత్యమే శివం
"దేవుడుంటే బాగుండు..దేవుడు లేదని నేనేక్కదన్నాను??" -దశావతారం.
పై రెండు సినిమాలకు కథ, స్క్రీన్ ప్లే కమల్ అందించాడు. దేవుడు , మతానికి
సంభందించిన అనేక విషయాలను చక్కగా చర్చించిన సినిమాలు. ఎక్కడ దేవుడి పై
గాని, భక్తుల పై గాని, మాతాల పై గాని అసందర్భ విమర్శ లేని సినిమాలు. అదే
సమయం లో తర్ఖిక ప్రశ్నలు లేవనెత్తి చర్చిస్తాడు (దశావతారం లో శైవ. వైష్ణ
మతాల మధ్య ఒక సమయం లో ఉన్న వైరం, దాన్ని మూర్ఖంగా నమ్మిన ఇద్దరు స్నేహితుల
వైరం, అవి నేటి సమాజానికి ఎంత అనవసరం అయ్యయో, ఎలా కొట్టుకుపోయాయో చెపుతాడు,
అలానే సత్యమే శివం లో ఇద్దరు భక్తులు -నాజార్, మాధవన్ మధ్య నడిచిన ఒక
నాస్తికుని, కమ్యునిస్ట్ భావజాలం ఉన్న ఒక వ్యక్తీ, అతని లో వచ్చిన మార్పు,
అదే ఇతరులను ప్రేమ గా చూసే గుణం, దాన్నే దైవం అని చెప్పే ప్రయత్నం)
కమల్ గొప్ప నటుడు మాత్రమె కాదు. ఒక గొప్ప వ్యక్తిత్వం, గొప్ప ఆలోచనలు గల
వ్యక్తీ. ఆతను ఒక నటుడు గానే కాదు, ఒక కొత్త ఆలోచనలను ప్రభావం చేయగల
వ్యక్తీ గా మన సమాజానికి ఏంటో అవసరం. ఇప్పుడు సినిమాని ఆపేయమని గొడవ
చేస్తున్నది..ఒక మతం వాళ్ళు గా కాకుండా.., మతాన్ని అడ్డుపెట్టుకొని ప్రచారం
పొందాలని చుస్తున్నవారిగా అర్థం చేసుకోవాలి. ఇలా సినిమా ని ఆపటం వాళ్ళ,
జరిగే ప్రయోజనం ఏమి లేదు. చూసేవాళ్ళు కచ్చితంగా చూస్తారు. ఇప్పుడు అనేక
సాధనాలు. కమల్ కి, నిర్మాతలకి (తన కుటుంభానికి) అది ఆర్థిక నష్టం తెస్తుందేమో కాని ఆతను చెప్పాల్సిన విషయాన్ని కచ్చితంగా చర్చకు వస్తుంది.అదే అతని ప్రయత్నం కనుక, అతడు సినిమా కి ముందే ఆ పని చేయగలిగాడు.
Tuesday, January 22, 2013
మంచి తనం మించిన దొరకదు - 2 (సత్యం చెప్పే మాట)
"నమ్మండి నాస్తికులుగ మాట్లాడకండి, ఊరంత చాల మంచి వాల్లు ఉన్నరు, వాల్లంత దేవుల్లె" -సత్యమే శివం లోని సత్యం చెప్పే చివరి డైలాగ్.
అలంటి దేవుడే "కళ్యాణ సుందరం"..
మనుషులను ఇప్పుడు రెండుగా విడగొట్టి చుస్తే., చెడ్డ వాళ్ళు, మరియు అమాయకులు గానో., చేతగాని వాళ్ళు, లౌక్యం గల వాళ్ళు గానో మాత్రమె విభజిస్తాము. ఎందుకంటే మంచివాళ్ళు మనకు అమాయకుల లాగానో, లౌక్యం గా బ్రతకటం చేతకాని వాళ్ళుగా మాత్రమె కనపడుతారు. "మంచి తనం" మన మధ్యలో మాత్రమె తిరుగుతుంటే నమ్మశక్యం కాదు.
"కళ్యాణ సుందరం" లైబ్రేరియన్ గా పని చేసి ఈ మధ్యే పదవి విరమణ చేసాడు. పది లక్షలకు పైగా "రిటైర్మెంట్ బెనిఫిట్స్" పొందాడు. అయితే అతని గొప్పతనం ఏంటంటే అందులో ఒక్క పైసా తన కోసం ఉంచుకోలేదు. మొత్తం దాన ధర్మాలకు ఇచ్చేసాడు. అలంటి వాళ్ళు చాల మంది ఉండే ఉంటారు అంటారా???
ఆయన మరో గొప్పతనం, ఎవరు అందుకోలేని మహోన్నత వ్యక్తిత్వం ఏంటంటే.. ఇంత వరకు తన జీతం మొత్తం, ఇప్పటి వరకు తనకు వచ్చిన ప్రతి పైసా, కష్ట పది పని చేస్తే వచ్చిన జీతం మొత్తం ఇలాంటి దాన ధర్మాలకు వినియోగించాడు. తన అవసరాల కోసం విడిగా హోటల్ లలో సర్వర్ గా పని చేసి సంపాదించాడు. అలా సర్వర్ గా పని చేస్తూ వచ్చిన డబ్బులు మాత్రమె తన కోసం వాడుకొన్నాడు.
ప్రపంచం మొత్తం లో ఇలా సంపాదన మొత్తం మంచి కార్యక్రమాలకు వినియోగించిన ఏకైక వ్యక్తీ, "కళ్యాణ సుందరం". U.N.O. ఇది గుర్తించింది. అమెరికాలోని ఒక అతన్ని "మాన్ ఆఫ్ మిలీనియం" బిరుదును కొంత నగుదు ని అతనికి బహుకరించింది. మల్లి ఇతను ఆ బహుమతి మొత్తాన్ని(ఎంత..ముప్పై కోట్లే) చారిటి కే ఉపయోగించాడు. అతను "పాలం" అనే సంస్థ ద్వార సమాజ సేవ కార్యక్రమాలు చేస్తున్నాడు. ఇప్పటికి రోడ్డు పైనో, ప్లాట్ ఫాం పైనో పడు కోవడానికి అతనికి ఎ భాధ ఉండదు. అలా ఉంటేనే అసలైన పేదల భాద తెలుస్తుంది అంతాడు. ఇండో-చైనా యుద్ధం మొదలైనప్పుడు మొదలైన ఈ సేవ కార్యక్రమాల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది. రజినీకాంత్ ఇతన్ని "తండ్రి" గా దత్తత తీసుకొన్నాడు. అప్పుడు కాని పత్రికలకు ఆతను "వార్తా" కాలేదు.
ఉద్యోగి గా, జీతం కోసం, జీతం పెరగడం కోసం, అందుకు చేసే బంద్ ల కోసం, పే కమిషన్ లెక్కల కోసం, అధికారం కోసం, ప్రమోషన్ కోసం, అహంకారం కోసం (ప్రభుత్వ ఉద్యోగి అనే), అవినీతికి దొరికే అవకాశం కోసం పనిచేయడం ఇప్పటి లౌక్యానికి, తెలివికి మనం ఇచ్చే నిర్వచనం. కాదంటారా..
కాదనండి..చుట్టూ చుడండి. ఇలాంటి వాళ్ళు ఎందఱో ఉన్నారు. మంచి తనం ను మించినది లేదనే సిద్దాంతం మిద నిలబడే, బ్రతికున్న దేవుళ్ళు.. హోటల్లో కాన పడే సర్వర్ కావచ్చు, రిక్షా నడిపే కార్మికుడు కావచ్చు, రోడ్డు పక్కన అడుక్కొనే బిచ్చగాడు కావచ్చు, రోడ్డు మద్యలో నిలబడ్డ ట్రాఫిక్ పోలిస్ కావచ్చు, కార్లలో తిరిగే దొరబాబు కావచ్చు.. మంచితనం పంచుతూ తిరుగుతూ ఉండొచ్చు. అనుమానపు కళ్ళద్దాలు ఉంటేనే ఈ లోకం లో బతక గలమనే పిరికి తనం వదిలిన్చుకొంటే..లోకం మరింత అందంగా.., కొత్తగా కనపడుతోంది. ఇదే "సత్యమే శివం" సూత్రం.
http://www.hindu.com/thehindu/mp/2003/04/23/stories/2003042300060300.htm
అలంటి దేవుడే "కళ్యాణ సుందరం"..
మనుషులను ఇప్పుడు రెండుగా విడగొట్టి చుస్తే., చెడ్డ వాళ్ళు, మరియు అమాయకులు గానో., చేతగాని వాళ్ళు, లౌక్యం గల వాళ్ళు గానో మాత్రమె విభజిస్తాము. ఎందుకంటే మంచివాళ్ళు మనకు అమాయకుల లాగానో, లౌక్యం గా బ్రతకటం చేతకాని వాళ్ళుగా మాత్రమె కనపడుతారు. "మంచి తనం" మన మధ్యలో మాత్రమె తిరుగుతుంటే నమ్మశక్యం కాదు.
"కళ్యాణ సుందరం" లైబ్రేరియన్ గా పని చేసి ఈ మధ్యే పదవి విరమణ చేసాడు. పది లక్షలకు పైగా "రిటైర్మెంట్ బెనిఫిట్స్" పొందాడు. అయితే అతని గొప్పతనం ఏంటంటే అందులో ఒక్క పైసా తన కోసం ఉంచుకోలేదు. మొత్తం దాన ధర్మాలకు ఇచ్చేసాడు. అలంటి వాళ్ళు చాల మంది ఉండే ఉంటారు అంటారా???
ప్రపంచం మొత్తం లో ఇలా సంపాదన మొత్తం మంచి కార్యక్రమాలకు వినియోగించిన ఏకైక వ్యక్తీ, "కళ్యాణ సుందరం". U.N.O. ఇది గుర్తించింది. అమెరికాలోని ఒక అతన్ని "మాన్ ఆఫ్ మిలీనియం" బిరుదును కొంత నగుదు ని అతనికి బహుకరించింది. మల్లి ఇతను ఆ బహుమతి మొత్తాన్ని(ఎంత..ముప్పై కోట్లే) చారిటి కే ఉపయోగించాడు. అతను "పాలం" అనే సంస్థ ద్వార సమాజ సేవ కార్యక్రమాలు చేస్తున్నాడు. ఇప్పటికి రోడ్డు పైనో, ప్లాట్ ఫాం పైనో పడు కోవడానికి అతనికి ఎ భాధ ఉండదు. అలా ఉంటేనే అసలైన పేదల భాద తెలుస్తుంది అంతాడు. ఇండో-చైనా యుద్ధం మొదలైనప్పుడు మొదలైన ఈ సేవ కార్యక్రమాల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది. రజినీకాంత్ ఇతన్ని "తండ్రి" గా దత్తత తీసుకొన్నాడు. అప్పుడు కాని పత్రికలకు ఆతను "వార్తా" కాలేదు.
ఉద్యోగి గా, జీతం కోసం, జీతం పెరగడం కోసం, అందుకు చేసే బంద్ ల కోసం, పే కమిషన్ లెక్కల కోసం, అధికారం కోసం, ప్రమోషన్ కోసం, అహంకారం కోసం (ప్రభుత్వ ఉద్యోగి అనే), అవినీతికి దొరికే అవకాశం కోసం పనిచేయడం ఇప్పటి లౌక్యానికి, తెలివికి మనం ఇచ్చే నిర్వచనం. కాదంటారా..
కాదనండి..చుట్టూ చుడండి. ఇలాంటి వాళ్ళు ఎందఱో ఉన్నారు. మంచి తనం ను మించినది లేదనే సిద్దాంతం మిద నిలబడే, బ్రతికున్న దేవుళ్ళు.. హోటల్లో కాన పడే సర్వర్ కావచ్చు, రిక్షా నడిపే కార్మికుడు కావచ్చు, రోడ్డు పక్కన అడుక్కొనే బిచ్చగాడు కావచ్చు, రోడ్డు మద్యలో నిలబడ్డ ట్రాఫిక్ పోలిస్ కావచ్చు, కార్లలో తిరిగే దొరబాబు కావచ్చు.. మంచితనం పంచుతూ తిరుగుతూ ఉండొచ్చు. అనుమానపు కళ్ళద్దాలు ఉంటేనే ఈ లోకం లో బతక గలమనే పిరికి తనం వదిలిన్చుకొంటే..లోకం మరింత అందంగా.., కొత్తగా కనపడుతోంది. ఇదే "సత్యమే శివం" సూత్రం.
http://www.hindu.com/thehindu/mp/2003/04/23/stories/2003042300060300.htm
Wednesday, January 9, 2013
దేఖో అక్భర్ సాబ్..! రాజకీయానికి మరో దారి ఉంది
మాట్లాడుకోవడానికి
మనకు మంచి మాటలు ఇంకా మిగిలే ఉన్నాయి. మంచి మాట్లాడేవాళ్ళు ఉన్నారు.
అక్బరుద్దీన్ తన మనుగడ కోసం, రాజకీయ లబ్ది కోసం అన్న మాటలు అతననుకొన్న
ప్రతాపం, ప్రకోపం చూపించలేదు. అందుకు కారణం అందరు అలాంటివాళ్ళు కాకపోవటమే.
నీలాంటి వాళ్ళు ఇంకా తెగపడ్డ దారుణాలు జరగవు అని చెప్పారు ..ఎందుకంటే...
మాకు దసరా జమ్మి ఎంత తెలుసో, పిరిలా పండుగ అంత తెలుసు
గుడికి, దర్గాకి తేడ తెలియక పెరుగాము
చిన్నోడికి కడుపునొప్పి వస్తే పీర్ సాబ్ దగ్గరికి పోయాము
ఖాజా సాబ్ కి జమ్మి ఇచ్చి కాలు మొక్కం
గణేష్ నిమజ్జన్నైకి రావాడానికి "భాష" కి అడ్డేమి లేదు
వాళ్ళంతా వేరే మతం అని పెరగలేదు..,మా లాగానే వాళ్ళది మరో కులం అనే అనుకొన్నారు
అల్లుడు అన్నారు, బావ అని మా బాపు ని పిలిచారు
నికేమి తెలియక పోవచ్చు..నివు చదివింది, పెరిగింది ఇక్కడ కాకపోవచ్చు.
పిరులు ఎత్తడం నేర్చుకో, దర్గా లా చుట్టూ ఏముందో చూడు..
రాజకీయానికి మరో దారి కూడా ఉంది.., దగ్గరికి వెళ్లి చూడు
దగ్గరికి వెళ్లి చూడు
మసీదుల్లో నే కాదు., మనుషుల్లోనూ అల్లా ఉన్నాడు
Thursday, September 27, 2012
మంచి తనం మించిన దొరకదు...
అందరిలో దైవం చూస్తూ, తనే దేవుడు అనుకొనే శివుడు (పాగల్ లో కూడా దేవుడు ఉంటాడనే పాగల్)
హిరో మిద అభిమానాన్ని , పేదలకు సేవ చేసే విధి గా మార్చుకొన్న చెరుకు బండి నూర్
పాత పురాణ సినిమాల్లో (అలంటి సినిమాలలో సినిమా కష్టాలు అతిగా ఉంటాయని..)
కూడా చూడని కష్టాలను దాటి, క్షమా, ప్రేమ పంచుతూ పది మందికి ఆశ్రయం ఇచ్చిన
అస్రఫ్ షరీఫా
పేదరికం తో పారిపోయి వచ్చి వంద మందికి అన్నం పెట్టగలిగిన ఎత్తుకు ఎదిగిన బాబురావు
"కలాం" గారి స్పీచ్ విని కొత్త జీవన శైలి తో ఎదుగుతున్న దిలీప్
పది రూపాయలకే అన్నం పెట్టి, తిన్న వాళ్ళను దేవులనుకొనే భారతమ్మ ..
ఇలాంటి వారు ఎందఱో..ఒక్కక్కరు ఒక పుస్తకం, పేదరికం అడుగున జీవిస్తూ,
అద్భుతమైన వ్యక్తిత్వం తో మన చుట్టే తిరుగుతున్నా దేవుళ్ళు... మంచితనం
చచ్చిపోయిందనే ఇసురోమనే మనుషుల మేధ కు ఆవల నిలిచిపోయిన వాళ్ళు..
"కందుకూరి రమేష్ బాబు" గారు ప్రచురించిన(సాక్షి, కౌముది లలో) కొన్ని వ్యాసాలలో బయటపడ్డ మేలి ముత్యాలు
http://samanyashastram.org/ index.html లో వెళ్లి "ప్రొఫైల్" వెదకండి
పది రూపాయలకే అన్నం పెట్టి, తిన్న వాళ్ళను దేవులనుకొనే భారతమ్మ ..
ఇలాంటి వారు ఎందఱో..ఒక్కక్కరు ఒక పుస్తకం, పేదరికం అడుగున జీవిస్తూ, అద్భుతమైన వ్యక్తిత్వం తో మన చుట్టే తిరుగుతున్నా దేవుళ్ళు... మంచితనం చచ్చిపోయిందనే ఇసురోమనే మనుషుల మేధ కు ఆవల నిలిచిపోయిన వాళ్ళు..
"కందుకూరి రమేష్ బాబు" గారు ప్రచురించిన(సాక్షి, కౌముది లలో) కొన్ని వ్యాసాలలో బయటపడ్డ మేలి ముత్యాలు
http://samanyashastram.org/
Wednesday, September 5, 2012
నా గురువు.., మా తాత
"తొమ్మిదో ఎక్కం చెప్పు"
"తొమ్మిది ఒక్కట్లు ..."
"ముందు నుంచి కాదు, వెనక నుంచి.."
"తొమ్మిది ఒక్కట్లు ..."
"ముందు నుంచి కాదు, వెనక నుంచి.."
..........
"sare...ముందు నుంచి చేపతనంటే పదమూడో ఎక్కం చెప్పు"
"పో నేను చెప్పను.. ఎవరియన మూడో తరగతిలో పదమూడో ఎక్కం చెపుతారా.."
..రాజమౌళి సారూ మనవడు చెప్పాలి..ఆ రాజమౌళి సారు మనవడిని నేనే..మొదటి తరగతి మొదలు పెట్టనప్పడి నుండి అయన దగ్గరే పెరిగాను. (అమ్మమ్మ దగ్గరే అయిదవ తరగతి వరకు చదివా). నా గురువు, మెంటర్, రోల్ మోడల్ అన్ని ఆయనే. పేరుకి అతుక్కుపోయిన "సారూ" అనే మాటకు గౌరవం ఏర్పరిచిన వ్యక్తి. నిజం జమానా లో, వరంగల్ లో చదివి లెక్కల లో ఒక పతకం పొందిన మనిషి. అందుకే లెక్కలంటే ఆయనకి అంత ఇష్టం గా ఉండేది. వ్యక్తిత్వం లోను లెక్క ప్రకారంగా ఉండేవాడు. హేతువాది. రిటైర్ అయిన తరువాత "సుల్తానాబాద్ (కరీంనగర్ జిల్లా) లో మహిళా స్కూల్ కోసం పెద్ద వారితో కస్టపడి నిర్మాణం లో మున్డుంది నడిపించాడు. ఆ నిర్మాణంలో కర్చయిన పదిహేను పైసల లెక్క కూడా చెప్పే వాడు ఇ లెక్కల సారూ. అప్పుడు అందరు ఇయన పట్ల కొంత భయ భక్తుల తో ఉండేవారు. అక్కడి ఎం.ఎల్.ఎ. (ఇద్దరు మాజీలు) ఇయనకి దగ్గరి వారు, భయపడే వారు. నేను లెక్కల్లో ముందుండే వాడిని. అల్లాంటి నన్ను మా లెక్కల సారు, మార్కండేయులు హోం వర్క్ తప్పు చేసానని కొట్టాడు (తప్పు కాకున్నా). నేను మా తాతయ్య పైన ఫైర్ అయ్యా.. నువ్వు చెప్పే లెక్కలు వింటే స్కూల్ లో తప్పులు పోతున్నాయని. సరేలే మీ సార్ నే అడుగుతాను అని, తరువాతి రోజు స్కూల్ కి వచ్చాడు. మా పెద్ద సారు (అంటే ప్రిన్సిపాల్) ప్యాంటు తడుపుకున్నంత పని చేసి, మార్కండేయులు అనే సారు నీ సస్పెండ్ చేసాడు. ఆ తరువాత ఎవరెన్ని చెప్పిన, చివరకు మా తాతయ్య చెప్పిన వినలేదు. ఎలాగోలా ఆయనకు ఒక సంవత్సరం తరువాత మల్లి తీసుకొన్నాడు..
"టీచర్స్ డే" అనగానే తాతయ్యే గుర్తొచ్చాడు..ఎంతో రాయలనుకొన్న, ఎంతో బాగా రాయలనుకొన్న..నా శక్తి ఇంతే అని ...ఆయనను మరోసారి తలుచుకొంటూ.., ఆయనతో పాటు మా కీసరగుట్ట సార్లు (ముక్యంగా నిజాముద్దీన్, ఆళ్వార్, సివారం రెడ్డి, శ్రీదర్), ఎందరికో ఆదర్శవంతమైన మా నాన్న, మా నాన్న వారసత్వం కొనసాగిస్తున్న మా తమ్ముడు, గోపి gopi krishna కి ... అందరికి ఉపాద్యాయ దినోత్సవ శుభాకాంక్షలు
"sare...ముందు నుంచి చేపతనంటే పదమూడో ఎక్కం చెప్పు"
"పో నేను చెప్పను.. ఎవరియన మూడో తరగతిలో పదమూడో ఎక్కం చెపుతారా.."
..రాజమౌళి సారూ మనవడు చెప్పాలి..ఆ రాజమౌళి సారు మనవడిని నేనే..మొదటి తరగతి మొదలు పెట్టనప్పడి నుండి అయన దగ్గరే పెరిగాను. (అమ్మమ్మ దగ్గరే అయిదవ తరగతి వరకు చదివా). నా గురువు, మెంటర్, రోల్ మోడల్ అన్ని ఆయనే. పేరుకి అతుక్కుపోయిన "సారూ" అనే మాటకు గౌరవం ఏర్పరిచిన వ్యక్తి. నిజం జమానా లో, వరంగల్ లో చదివి లెక్కల లో ఒక పతకం పొందిన మనిషి. అందుకే లెక్కలంటే ఆయనకి అంత ఇష్టం గా ఉండేది. వ్యక్తిత్వం లోను లెక్క ప్రకారంగా ఉండేవాడు. హేతువాది. రిటైర్ అయిన తరువాత "సుల్తానాబాద్ (కరీంనగర్ జిల్లా) లో మహిళా స్కూల్ కోసం పెద్ద వారితో కస్టపడి నిర్మాణం లో మున్డుంది నడిపించాడు. ఆ నిర్మాణంలో కర్చయిన పదిహేను పైసల లెక్క కూడా చెప్పే వాడు ఇ లెక్కల సారూ. అప్పుడు అందరు ఇయన పట్ల కొంత భయ భక్తుల తో ఉండేవారు. అక్కడి ఎం.ఎల్.ఎ. (ఇద్దరు మాజీలు) ఇయనకి దగ్గరి వారు, భయపడే వారు. నేను లెక్కల్లో ముందుండే వాడిని. అల్లాంటి నన్ను మా లెక్కల సారు, మార్కండేయులు హోం వర్క్ తప్పు చేసానని కొట్టాడు (తప్పు కాకున్నా). నేను మా తాతయ్య పైన ఫైర్ అయ్యా.. నువ్వు చెప్పే లెక్కలు వింటే స్కూల్ లో తప్పులు పోతున్నాయని. సరేలే మీ సార్ నే అడుగుతాను అని, తరువాతి రోజు స్కూల్ కి వచ్చాడు. మా పెద్ద సారు (అంటే ప్రిన్సిపాల్) ప్యాంటు తడుపుకున్నంత పని చేసి, మార్కండేయులు అనే సారు నీ సస్పెండ్ చేసాడు. ఆ తరువాత ఎవరెన్ని చెప్పిన, చివరకు మా తాతయ్య చెప్పిన వినలేదు. ఎలాగోలా ఆయనకు ఒక సంవత్సరం తరువాత మల్లి తీసుకొన్నాడు..
"టీచర్స్ డే" అనగానే తాతయ్యే గుర్తొచ్చాడు..ఎంతో రాయలనుకొన్న, ఎంతో బాగా రాయలనుకొన్న..నా శక్తి ఇంతే అని ...ఆయనను మరోసారి తలుచుకొంటూ.., ఆయనతో పాటు మా కీసరగుట్ట సార్లు (ముక్యంగా నిజాముద్దీన్, ఆళ్వార్, సివారం రెడ్డి, శ్రీదర్), ఎందరికో ఆదర్శవంతమైన మా నాన్న, మా నాన్న వారసత్వం కొనసాగిస్తున్న మా తమ్ముడు, గోపి gopi krishna కి ... అందరికి ఉపాద్యాయ దినోత్సవ శుభాకాంక్షలు
Subscribe to:
Posts (Atom)


